నల్గోండ
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. దుర్భుద్ధితో తెలంగాణ ను దోచుకునేందుకు కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఎవరి హయాంలో అయితే హైదరాబాద్ లో అల్లాకొల్లలం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలను తెచ్చారో వారే ఇవ్వాళ పార్టీ స్థాపిస్తాం అంటూ నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారు. సుస్థిర ప్రభుత్వంను బలహీన పరచేందుకే కొన్ని శక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆశకు కూడా హద్దు ఉంటుంది. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. రాజకీయ లబ్ది పొందాలని చుస్తే వల్ల పప్పులు ఇక్కడ ఉడకవు. తెలంగాణ లో గడీల పాలన లేదు.. ప్రజాస్వామ్య యుతంగా పాలన సాగుతున్నది. కులాల పేరుతో మతాల పేరుతో , ప్రజలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కొన్ని శక్తులు గోతి కాడి నక్కలగా చూస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త...ప్రజలంతా జాగురుకతతో ఉండాలి.. తెలంగాణ ను అస్థిర పరిచే శక్తులకు ఇక్కడ స్థానం లేదు... అవకాశం ఇవ్వకూడదని అయన అన్నారు.