YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిండు మనసుతో ఆశీర్వదించండి

నిండు మనసుతో ఆశీర్వదించండి

విజయవాడ, ఏప్రిల్ 10,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు సీఎం జగన్‌ శనివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నానని, 24 గంటల్లో కరోనాతో మరణించిన 11 మందిలో.. నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే 496 కేసులు నమోదయ్యాయని, నెల్లూరు జిల్లాలో కూడా 292 కేసులు వచ్చాయన్నారు. ఇవాళ కరోనా బులెటిన్‌ చూశాక.. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు. మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉంది’’ అని సీఎం లేఖలో పేర్కొన్నారు. తనకు ప్రజల ఆరోగ్యం, ఆనందమే ముఖ్యమని.. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తన సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశానని, అందులో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరించానని తెలిపారు.మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో, గుండె నిండా ప్రేమతో, రెట్టింపయిన నమ్మకంతో మీ అందరి చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నా. మనందరి అభ్యర్థి, నా సోదరుడు డాక్టర్ గురుమూర్తిని.. గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్నకు ఇచ్చిన మెజారిటీ (2.28 లక్షలు) కన్నా ఇంకా ఎక్కువగా.. ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేస్తారని, ప్రతి ఒక్కరూ మరో నలుగురితో మన అభ్యర్థి గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేయిస్తారని ఆశిస్తూ.. అభ్యర్థిస్తూ దేవుడి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలకు, మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

Related Posts