YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎస్ కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

సీఎస్ కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

అమరావతి
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ కు  ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. సీబీఐతో తన కేసు దర్యాప్తు చేయించాలని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. తన ఆరోపణలను రుజువు చేసే 9 పత్రాలను లేఖకు జోడించారు. డీజీపీ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు ఆధారాలను లేఖకు జత చేశారు. డీజీ సవాంగ్, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ అధికారులు, మరికొందరి ప్రమేయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఏబీవీ లేఖతో సచివాలయంలో కలకలం రేగింది. తనపై ఎంక్వయిరీస్ కమిషనర్ జరిపిన విచారణ సందర్భంగా దొంగ డాక్యుమెంట్లను సమర్పించారని గతంలోనే ఏబీవీ ఆరోపించారు. సీబీఐతో విచారణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

Related Posts