నెల్లూరు
జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాలుంటర్ వ్యవస్థలను ఉపయోగించుకున్నారో చూడండి. ఓటు వేసే బాధ్యత మీదే అని వాలంటర్లకు చెబుతున్నారు. వైసీపీ కార్యకర్తలు చేయాల్సిన పని వాలంటర్ లు చేస్తున్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. వీటన్నింటినీ ఎన్నికల సంఘము దృష్టికి తీసుకువెళ్తాము. ముఖ్యమంత్రి గారు తాడేపల్లి రాజాప్రసాదంలో కూర్చొని ఏ ఎన్నికలకు రాను అని అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి అహంకారాన్ని తిరుపతి ప్రజలు భూమి మీదకు దించారు. ఎన్నికల ముందు ఏమి చెప్పారు ప్రతీ జిల్లాను హైదరాబాద్ చేస్తానని చెప్పారు..ఏమైంది హైదరాబాద్. హైదరాబాద్ కాలేదు ఉల్టా అయింది. పోలవరం ఎత్తు తగ్గించారు. పోలవరం కట్టలపై మట్టి అంతా ఎత్తుకుపోయారు. పెన్నా నది నుంచి వేయి లారీలు వెళ్తున్నాయి. వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఈ వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ? ఆనాడు ఏమి చెప్పావు నాకు బలం ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పావు ఏమైంది ప్రత్యేక హోదా ? హైదరాబాద్ ఉన్న మన ఆస్తులను అప్పనంగా కేసీఆర్ కి తాకట్టు పెట్టారని అయన అన్నారు.