YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఆటవీ సిబ్బందిని చితకబాదిన గిరిజనులు

ఆటవీ సిబ్బందిని చితకబాదిన గిరిజనులు

కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని డి. కొత్తూరు బీట్ పరిధిలోని చింతగుప్ప గ్రామంలో ఫారెస్ట్ భూమిలో స్ట్రేంచ్ కొట్టడానికి వెళ్లిన ఫారెస్ట్ బీట్ సిబ్బంది హుస్సేన్,రాజేష్,విజయ లను అక్కడి గ్రామస్థులు చెట్టుకి కట్టేసి తాళ్లతో బంధించి చితకబాదిన ఘటన కొద్దిసేపటి క్రితం జరిగింది. రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఇదే ప్రాంతానికి వెళ్లి పోడు భూమి సాగుదారులకు పట్టాలు ఇప్పించే ఏర్పాటు చేస్తామని,ఫారెస్ట్ అధికారులు ఎవ్వరూ ఇక్కడి గిరిజనులను అడ్డుకోవద్దు అని చెప్పి వెళ్లిన 2 రోజులకే ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో స్ట్రేంచ్ కొట్టడానికి వెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. దీనితో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Related Posts