YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ పోగరు అణచాలంటే బీజేపీకి వోటేయ్యండి

కేసీఆర్ పోగరు అణచాలంటే బీజేపీకి వోటేయ్యండి

నల్లగొండ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి అబ్యర్ది తరపున విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుమలగిరి(సాగర్) మండలం నెల్లికల్లు లో రోడ్ షో జరిగింది. విజయశాంతి  మాట్లాడుతూ దొర అధికారంలోకి వచ్చాక   మొదటిమోసం దళితుణ్ణి సీఎం చేస్తారని చేయలేదు. ఇంటింటికి నల్లా ఇస్తేనే ఓటు అడుగుతా అన్నాడు.. కానీ ఇవ్వకుండానే ఓట్లు అడుగుతున్నాడు. ఈ చేతుల మీదుగా తెలంగాణ తీసుకొచ్చాను... నా తెలంగాణ బాగుపడాలని. ఈ దొంగ అధికారం లోకి వచ్చాక రాష్ట్రాన్ని కబ్జాల తెలంగాణా గా మార్చాడు. 2014 నుండి 2018 వరకు వాగ్దానాలు ఇచ్చాడు నెరవేర్చాడా..? 2018 లో హామీలు ఇచ్చాడు నెరవేర్చాడా..? ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగాలు రాకపోవడానికి కారణం కేసీఆర్ కాదా..? తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. బిజెపి మీకోసం గుర్రంబోడు తండాలో పొడుభూముల కోసం పోరాడింది. మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదని తిరగబడండి. జానారెడ్డి కి ఓటేస్తే మీ వోటు మురిగిపోతుంది...ఆ పార్టీ కేంద్రంలో లేదు, రాష్ట్రములో లేదు. ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ పొగరు అనచాలంటే బీజేపీ కి ఓటెయ్యండని ఆమె కోరారు.

Related Posts