YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఇన్పూరెన్స్ కోసం..భర్తను చంపేసిన భార్య

ఇన్పూరెన్స్ కోసం..భర్తను చంపేసిన భార్య

చెన్నై, ఏప్రిల్ 12, 
అల్లుడికి ఆశచూపించి దిమ్మతిరిగే స్కెచ్ గీసింది అత్త. ఏకంగా కట్టుకున్న భర్తని కాటికి పంపించింది. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యానుకి మంటలు అంటుకుని తన మాంగశ్యం మసైపోయిందని కన్నీరుమున్నీరైంది. అయితే పోలీసులకు ఏం చెప్పాలో ముందే ఒకమాట అనుకోకపోవడంతో అత్తాఅల్లుడు తడబడ్డారు. ఇద్దరూ పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో ఖాకీలకు అనుమానం తట్టింది. అసలు బాగోతం బయటపడింది. బీమా డబ్బుల కోసం కట్టుకున్న భార్యే అల్లుడితో కలసి భర్తను నిలువునా తగలబెట్టిందని తేలింది. ఈ అత్యంత దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఈరోడ్ జిల్లా తుడుప్పాదికి చెందిన రంగరాజన్(62) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. బిజినెస్‌లో నష్టం రావడంతో కోటి రూపాయలకు పైగా బాకీ పడ్డాడు. ఆ విషయం తెలిసిన భార్య జ్యోతిమణి(55) అప్పనంగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేయాలని దారుణానికి ఒడిగట్టింది. తన భర్తనే బలి చేయాలని నిర్ణయించుకుంది. ఆయన పేరు మీద ఉన్న బీమా డబ్బులు వస్తే ఎంచక్కా అప్పులు తీర్చేసి ఎంజాయ్ చేయొచ్చని భావించి భర్త హత్యకు పక్కాగా ప్లాన్ చేసింది. తనకు అల్లుడు వరుసైన(సోదరి అల్లుడు) రాజా(40)తో డీల్ కుదుర్చుకుంది. భారీగా డబ్బులు ఆశచూపి తన వైపు తిప్పుకుంది.ఇద్దరూ కలసి రంగరాజన్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేశారు. ఆరోగ్యం బాగోక ఆస్పత్రిలో చేరిన రంగరాజన్‌ను ఇంటికి తీసుకొచ్చే సమయంలో ప్లాన్ అమలు చేశారు. రోడ్డుపై వ్యాన్ ఆపేసి డబ్బాలో తెచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. మామ మంటల్లో కాలిబూడిదయ్యాక తాపీగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మొత్తం కాలి బూడిదైంది. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్తుంటే ఇంజిన్‌లో మంటలు వచ్చాయని.. కిందకు దిగి చూసేలోపే మంటలు వ్యాపించి తన భర్త కాలిపోయాడంటూ దొంగేడుపు అందుకుంది జ్యోతిమణి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. అత్త జ్యోతిమణి, అల్లుడు రాజాని ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు వచ్చాయి. తన తండ్రి మరణంపై తనకూ అనుమానాలున్నాయని కొడుకు చెప్పడంతో పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. అత్తాఅల్లుళ్లను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రంగరాజన్‌కి కోటిన్నర వరకూ అప్పు ఉందని.. ఆయన పేరు మీద ఉన్న మూడు కోట్ల రూపాయల బీమా సొమ్ము కోసం భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. కసాయి భార్యతో పాటు ఆమెకు సహకరించిన అల్లుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు

Related Posts