YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం సోమగండి గ్రామంలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల మైనర్ బాలిక పై అదే గ్రామానికి చెందిన గంటా సంతు(24) అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై నిందితుడు అత్యాచారం చేసాడు. తరువాత విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ 20 రూపాయలు మైనర్ బాలిక చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. రక్తస్రావం అవుతున్న చిన్నారిని ఆసుపత్రికి తరలించడంతో దారుణం  వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసారు.  పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు సంతు పరారీలో వున్నాడు. 

Related Posts