వరంగల్ ఏప్రిల్ 13
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కేటీఆర్ వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేయవద్దని చెప్పారు. కొందరు నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేయూ స్టూడెంట్ సునీల్ను రెచ్చగొట్టడం వల్లే చనిపోయాడని చెప్పారు. సునీల్కు బ్రెయిన్ వాష్ చేయడం వల్లే కేసీఆర్పై మాట్లాడారన్నారు. ఐఏఎస్ కావాల్సిన వాడినని బోడ సునీల్ వీడియోలో చెప్పాడు. ఐఏఎస్ భర్తీ చేసే నోటిఫికేషన్లు ఎవరిస్తారు? అని ప్రశ్నించారు. ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకుంటున్నారు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారు? అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ఉత్తమ్ ఎక్కడున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.