YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా ఆగడాలపై టీడీపీ పోరాటం - చంద్రబాబు నాయుడు

వైకాపా ఆగడాలపై టీడీపీ పోరాటం - చంద్రబాబు నాయుడు

నెల్లూరు
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.  చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాల కాలంలో వైకాపా నాయకులు ఏమి పీకారని తిరుపతి ఉప ఎన్నికలో 5 లక్షల ఓట్ల మెజారిటీ వైకాపా కి ఇవ్వాలి. రెండు సంవత్సరాలు కాలంలో పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేసుకుంటున్నారు. సొంత బాబాయి హత్య జరిగి రెండు సంవత్సరాలు పైగా కావస్తున్నా దోషులను శిక్షించకుండా, జగన్ రెడ్డి కాపాడుతున్నాడు. వైకాపా పార్టీ ఆగడాలకు అడ్డుగా తెలుగుదేశం పార్టీ నిలబడి పోరాడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు వైకాపా పార్టీ ఇచ్చే పాపిష్టి సొమ్ముకు ఆశపడకండి. ఇంటింటికీ తిరిగి వైకాపా పార్టీ ఏదో పీకినట్టు కరపత్రాలు వేసి మరీ వాలంటీర్ ల ద్వారా రాష్ట్రంలో పంచుతున్నారు. వైకాపా పార్టీ మీద ప్రజలు కోపంగా ఉన్నారు, వైకాపా నాయకులు చేసిన తప్పులను ప్రశ్నిస్తే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తాము అంటున్నారు. తెలుగుదేశం హయాంలో తిరుపతి...చెన్నై-చెన్నై...నెల్లూరు  వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా లక్షల మందికి తెలుగుదేశం పార్టీ ఉపాధి కల్పించింది. వైకాపా పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక పక్క పిల్లల భవిష్యత్ అంధకారం అయింది...ఇంకోపక్క పెద్దలు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు.
కోర్టులు కూడా పెండింగ్ బిల్లులు చెల్లించండి తీర్పు ఇచ్చినా కూడా న.రే.గా డబ్బులు ఇవ్వకుండా తెలుగుదేశం  నాయకులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. వైకాపా పార్టీ చెప్పిన అబద్ధాన్ని ఒకటికి వెయ్యి సార్లు చెప్పి నిజం చేయాలని చూస్తున్నారు.తమ్ముళ్లు మీరు కూడా డా బి ఆర్ అంబెడ్కర్ చెప్పినట్టు సత్యాన్ని ఒకటికి వెయ్యి సార్లు ప్రజలకు చెప్పండి అని నాయకులకు, కార్యకర్తలకు హితవు చెప్పారు.
జగన్ రెడ్డి అమ్మఒడి పథకానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా డబ్బులు పంచుతున్నాడు, మీలో ఎవరికి తక్కువ వచ్చినా కోర్టుకి వెళ్లి వడ్డీతో సహా తీసుకోండి. జగన్ రెడ్డి జోబులోంచి తీసి మీకు పంచడం లేదు, మీ డబ్బు మీకే పంచుతున్నాడు.
వంట నూనె కొనాలంటే సల సలా మరుగుతుంది, పప్పు ధాన్యాలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తనకన్నా కార్యకర్తల్లో ఎక్కువ మంది మంచి విశ్లేషకులు ఉన్నారు. మీరు పూర్తి విశ్లేషణ చేయండి, ఇంటింటికీ వెళ్లి వైకాపా పార్టీ మోసాలను  వివరించండి. ఎండలున్నాయి, ఇప్పుడు గెలిచినా మన అధికారంలోకి రాదు కదా అని ఉపక్రమించకండి, ఇదే ఉత్సాహం, ఇదే పట్టుదలతో తిరుపతి ఉప ఎన్నికలో ముందుకెళ్లండని అన్నారు.
తెలుగుదేశం నాయకులపై, కార్యకర్తలపై వైకాపా పార్టీ కేసులు పెట్టి తాత్కాలిక ఆనందం పొందుతున్నారు.వైకాపా నాయకుడు జగన్ రెడ్డి పై ఉన్న కేసులన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, ఈ రోజు తాత్కాలిక సంతోషం పొందినా చివరికి ధర్మమే గెలుస్తుంది, శిక్ష నుంచి తప్పించుకోలేడు.రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తయారుచేస్తానని అన్నారు. రాస్త్రానికి ఎదో చేయాలని కార్యకర్తలను కొంచం పట్టించుకోలేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం పడ్డ కష్టంలో కొద్దిపాటి సమయం కార్యకర్తల కోసం వెచ్చించాల్సింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు స్వార్థం కోసం పనిచేయలేదు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు, రాష్ట్ర ప్రజల సంతోషం కోసం పనిచేశారు. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమి చేయలేరు. తెలుగు జాతి బ్రతికున్నంత కాలం తెలుగుదేశం పార్టీ బతికుంటుందని అన్నారు.
=

Related Posts