జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యల ముసుగులో జగన్ చేసిన విమర్శలపై కుడా అయన మండిపడ్డారు. బిసిలను టిడిపికి దూరం చేయాలనే కుట్ర జరుగుతోంది. దీనిని బిసిలే సంఘటితంగా తిప్పికొడతారు. కుట్రదారులకు తిరుగులేని గుణపాఠం చెబుతారని అయన హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే 9మంది బిసిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించా. ఈ విషయాన్ని మరిచి అసందర్భ వ్యాఖ్యలు చేయడం బాధాకరం. కొందరు మహిళలు కూడా హైకోర్ట్ న్యాయమూర్తులు అయ్యారని అయన గుర్తు చేసారు. ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు,అందులో ఈశ్వరయ్య కూడా ఉన్నారు. వీరందరూ ఉన్నత స్థానాలను చేరుకుంది టిడిపి ప్రభుత్వ హయాంలోనే. బిసిలు అత్యధికంగా పదోన్నతులు పొందింది టిడిపి ప్రభుత్వంలోనే. దీనిని మరువరాదు,ఇది చరిత్రలో ఉన్న అంశం,దీనిని ఎవరూ తిరగరాయలేరని అయన అన్నారు. సీనియర్ న్యాయమూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన హోదాకు తగదు. అంతకుముందు హైకోర్టులో బిసిలను పట్టించుకునే వారు కాదు.ఆథిపత్యం ఉన్న ఒక కులానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. టిడిపి ప్రభుత్వంలోనే బిసిలు పదేళ్లపాటు న్యాయమూర్తులుగా పనిచేశారు. కాంగ్రెస్ పాలనలో,వైఎస్ హయాంలో స్వల్పకాలం మాత్రమే పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరు మాత్రమే ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. టిడిపి ప్రభుత్వంలో ఇద్దరు బిసిలు ఛీప్ జస్టిస్ లు అయ్యారని యనమల అన్నారు.