హైదరాబాద్ ఏప్రిల్ 14
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, విజయశాంతి, వివేక్ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అంబేద్కర్కు నివాళులర్పించడానికి.. సీఎం కేసీఆర్కు రెండు నిమిషాల సమయం లేకపోవడం బాధాకరమని, పబ్లిక్ మీటింగ్లకు మాత్రం సమయం ఉంటుందని విమర్శించారు. ముఖ్యమంత్రికి దళిత సంఘాలు భయపడుతున్నాయని అన్నారు. 150 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి.. సీఎం కేసీఆర్కు ఉన్న ఇబ్బంది ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు.