నల్గొండ
కోవిడ్ సెకండ్ వేవ్ పట్ల నాగార్జున సాగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్గోండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలో తగు జాగ్రత్తలు వహించాలని అన్నారు. డీఐజి రంగనాద్ మాట్లాడుతూ .సీఎం సభకు హాజరయ్యే ప్రజలు అలర్ట్ గా ఉండాలి. కోవిడ్ నిబంధనల మేరకు సభ జరిగేలా ఏర్పాట్లు చేశాం.ప్రజలు సహకరించాలి. .నిబంధనలకు విరుద్ధంగా సభకు అడ్డుకునే ప్రయత్నం చేసే వారిపై చటరిత్యా చర్యలు తీసుకుంటాం. ప్రచారాలు చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు.కవ్వింపు చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. .పోలీసు హెచ్చరికలు అన్ని పార్టీలకు వర్తిస్థాయని అన్నారు. .శాంతి భద్రతలకు విఘాతం కల్పించ కుండా ...శాంతి యుత వాతావరణంలో ఎన్నిక జరిగేటట్టు చర్యలు చేపట్టాం. .సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను వినియోగిస్తున్నాం. ఓటర్లను ప్రలోభ పెట్టే నేతలపై నిఘా పెట్టామని అన్నారు.