YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పోలీసు అక్రమ సంబంధం దేహశుద్ది చేసిన భార్య

పోలీసు అక్రమ సంబంధం దేహశుద్ది చేసిన భార్య

సిద్దిపేట జిల్లాలో ఓ పోలీస్ అధికారి కి అతని భార్య దేహ శుద్ధి చేసింది. తనని నమ్మించి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్న తర్వాత ఇప్పుడు మరో మహిళతో వేరు కాపురం పెట్టాడని ఆరోపిస్తూ  మమత అనే వివాహిత   తన ఇద్దరు పిల్లలతో కలసి కానిస్టేబుల్ రమేష్ ,  మరొ మహిళ అనూష పై దాడి చేశారు చీపురు కట్టలతో, చెప్పులతో  దేహ శుద్ధి చేశారు.

సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్న  గూడేళ్లి రమేష్,   మహబూబాబాద్ జిల్లా మర్పడగాబంగ్లా మండలం బావుజీ గూడెం కు చెందిన మమత తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది దింతో రమేష్ ,మమత 2006 ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు  కుమార్తెలు కూడా ఉన్నారు.  కొన్ని రోజుల అనంతరం మద్దూర్ మండలం లో ఉద్యోగ రీత్యా వచ్చిన రమేష్ కి అనూష తో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మార్పు చెందింది. వీరు ఇరువురు గుట్టు చప్పుడు కాకుండా చేర్యాల మండల కేంద్రం లో ఓ ఇంట్లో  కాపురం పెట్టారు.  రమేష్ ప్రవర్తన పై అనుమానం వచ్చిన మమత రమేష్ ని మందలించింది.  దింతో రమేష్ నేను వేరొక మహిళతో కాపురం చేస్తున్నానని ని ఇష్టం వచ్చిన పని చేసుకోమన్నాడు , నేడు ఉదయం మమత తన ఇద్దరు పిల్లలు,తల్లిదండ్రులతో కలసి చేర్యాల కు చేరుకొని రమేష్ అద్దెకు ఉంటున్న ఇంట్లో  కానిస్టేబుల్ రమేశ్, అనూషని రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. ఇద్దరికి  దేహశుద్ధి చేశారు. చీపురు కట్టలతో చెప్పులతో ఈడ్చుకొంటు కొట్టారు.ఈ నేపథ్యం లో రమేష్ మమతని కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదలిపెట్టు  అని ఎంత వేడుకున్నా వినలేదు. ఈ విషయం పోలీసులకు తెలియడం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రమేష్ ని మమత, అనూష, బంధువులను పోలీస్ స్టేషన్ కి తరలించారు. 

Related Posts