YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

భారీ అగ్నిప్రమాదంలో కంటైనర్ దగ్దం

భారీ అగ్నిప్రమాదంలో కంటైనర్ దగ్దం

భారీ అగ్నిప్రమాదంలో కంటైనర్ దగ్దం
ఇద్దరు సజీవ దహనం
రంగారెడ్డి ఏప్రిల్ 14, 
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటెనర్ లో చెలరేగిన మంటల్లో ఇద్దరు సజీవ దహనం అయ్యారు.  ఔటర్ రింగు రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ వద్ద భారీ కంటెనర్ లో మంటలు  చెలరేగాయి. మంటల్లో సూరజ్, మూర్తునుజన్ అనే డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. ఈ భారీ ఏసి కంటెనర్  ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న సమయంలో ఘటన జరిగింది. హిమయత్  నగర్ వద్ద కు రాగానే మరో లారీని డీకొట్టి ప్రమాదానికి గురైందని పోలీసులు వెల్లడించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పొలిసులు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చెసే లోపే రెండు ప్రాణాలు, కంటైనర్ అగ్నికి అహుతి అయిపోయాయి.

Related Posts