YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జానా కోసం పాట్లు

జానా కోసం పాట్లు

జానా కోసం పాట్లు
నల్గొండ, ఏప్రిల్ 15
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు పైనే అందరి భవిష్యత్ ఆధారపడి ఉంది. తొలినాళ్లలో అనుకున్నంత మాత్రం జానారెడ్డికి గెలుపు సులువుగా లేదు. ఇందుకు అనేక సామాజిక సమీకరణాలు ఉన్నాయి. రెడ్ది సామాజికవర్గం మొత్తం గంపగుత్తగా జానారెడ్డికి మద్దతిస్తుందన్న నమ్మకం లేదు. ఇతర సామాజికవర్గాల నుంచి కూడా జానారెడ్డికి సపోర్టు వస్తుందని చెప్పలేం. అభ్యర్థులను నిర్ణయించిన తర్వాత ఈక్వేషన్లు అలా చెబుతున్నాయి.ఇప్పుడు జానారెడ్డి గెలుపు ఇతర కాంగ్రెస్ నేతల చావుకొచ్చింది. జానారెడ్డి గెలిస్తే తిరిగి కాంగ్రెస్ రాష్ట్రంలో కొంత పుంజుకునే అవకాశాలున్నాయి. అలాగే ప్రజలు కూడా కొంత పార్టీ వైపు చూసే అవకాశముంది. అదే సమయంలో పార్టీ హైకమాండ్ సయితం సాగర్ ఉప ఎన్నికల్లో గెలిస్తేనే ఇక్కడి నేతలకు విలువ ఇస్తుంది. ఇప్పటివరకూ ఓటమి పాలయిన సీట్లలో ఏదో ఒక కారణం చూపి నేతలు తప్పించుకున్నారు.కానీ జానారెడ్డి విషయంలో అది సాధ్యం కాకపోవచ్చు. గత ఎన్నికల్లోనే తక్కువ మెజారిటీతో ఓటమి పాలయిన జానారెడ్డిని తిరిగి గెలిపించుకోలేక పోతే ఇక ఇక్కడి నేతల మొహం కూడా అధిష్టానం చూడకపోవచ్చు. పైగా తాము వ్యతిరేకించినా పీసీసీ చీఫ్ నియామకంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఎవరెన్ని చెప్పినా పార్టీ భవిష్యత్ కోసం హైకమాండ్ పీసీీసీ చీఫ్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశముంది.అందుకే జానారెడ్డి గెలుపు కోసం నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎలాగైనా జానారెడ్డిని గెలిపించుకోవాలని ఇప్టటికే నేతలు రంగంలోకి దిగారు. సామాజికవర్గాల వారీగా నేతలు ప్రచారం చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా కాంగ్రెస్ నేతల్లో ఐక్యత కన్పిస్తుండటం విశేషం. అందరు కలసి కట్టుగా జానారెడ్డి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకూ అందరూ ఏకమై ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం పీీసీసీ చీఫ్ నియామకమేనని అంటున్నారు.
ఆర్థికంగా ఆదుకొనేది ఎలా
తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా చాలా మంది నేతలు బలంగా ఉన్నా సరే తెలంగాణలో పార్టీని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలకు అనుకూల పరిస్థితులు ఉన్నా సరే వాటిని సమర్ధవంతంగా వాడుకునే విషయంలో నాయకత్వం ముందుకు అడుగు వేయలేకపోతోంది.పార్టీల అగ్రనేతలు కొంత మంది ఉన్నా సరే వాళ్ళు ఆర్థికంగా పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదని చెప్పాలి. దాదాపుగా మంత్రి పదవులు అనుభవించిన వారిలో ఎంపీలు గా పని చేసిన వాళ్ళు కేంద్ర మంత్రిగా పని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఎవరు కూడా పార్టీ కోసం ముందుకు రాకపోవడం పట్ల ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది.భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది నేతలు పార్టీ కోసం సమర్థవంతంగా పని చేయాల్సి ఉంటుందని చాలా మంది ఆర్థికంగా ప్రోత్సాహం అందించేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఆర్థిక సమస్యలను తీర్చడానికి సిద్ధమైందని తెలంగాణ కాంగ్రెస్ కోసం పని చేసే బలమైన నేతలను గుర్తించి వారికి అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం కూడా అందించే విధంగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Related Posts