YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్య

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్య

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్య
పాత కక్షల నేపధ్యంలో దారుణం
మృతుల్లో ఇద్దరు చిన్నారులు
విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ అగంతకుడు ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురిని అత్యంత దారుణంగా హతమార్చాడు. చిన్న పిల్లలను సైతం విడిచిపెట్టకుండా అత్యంత పాశవికంగా పొట్టనబెట్టుకున్నాడు. విశాఖపట్నంలోని పెందుర్తి మండలం జుత్తాడలో  జరిగిన ఈ దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. వివరాలు.. పాత కక్షల నేపథ్యంలో ఓ అగంతకుడు.. ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై దాడి చేసి చంపాడు. పదునైన ఆయుధంతో ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరినీ దారుణంగా హతమార్చాడు.  మృతదేహాలన్నీ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రెండు మృతదేహాలు బాత్ రూములో పడివున్నాయి.  మృతులు రమణ (63), ఉషారాణి (35), రమాదేవి (53), అరుణ(37) చిన్నారులు ఉదయ్ (2), ఉర్విష ( 6 నెలలు) గా గుర్తించారు.
రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ సంఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరుగురిని అప్పలరాజు అనే వ్యక్తే చంపి ఉంటాడని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అనంతరం అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సేకరిస్తున్నారు. ఆరుగురి హత్యతో జుత్తాడలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నం సీపీ మనీష్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు.

Related Posts