YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్ లో జానారెడ్డి గెలుపు తధ్యం - మాణిక్కం ఠాగూర్

సాగర్ లో జానారెడ్డి గెలుపు తధ్యం -  మాణిక్కం ఠాగూర్

నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది జానారెడ్డి గెలుపు తధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మాణిక్కం ఠాగూర్ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. సాగర్ లో కేసీఆర్ పోలీస్, మనీ, లిక్కర్ పవర్ ను ఉపయోగిస్తున్నారు. నియంత్రించడంలోఎన్నికల సంఘం పూర్తిగా విఫలం అయింది. ప్రజల పక్షాన జానారెడ్డి వాయిస్ అసెంబ్లీ లో ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జానారెడ్డి ని గెలిపించాలి. మానవతా రాయ్ ని పోలీస్ లు అరెస్ట్ చేసి హింసించడాన్ని ఖండిస్తున్నాం. పోలీస్ లు కేసీఆర్ కు ఏజెంట్లు గా వ్యవహరిస్తున్నారు. టిఆర్ఎస్ మందు, మణి పంచినా సాగర్ లో గెలుపు కాంగ్రెస్ దే. దుబ్బాకలో బీజేపీ విజయం నీటి బుడగ లాంటిదని తేలిపోయింది. 2018లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. సాగర్ లో కూడా బీజేపీ కి అదే రిపీట్ అవుతుందని అన్నారు.

Related Posts