YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీ, టీడీపీ, వైకాపాలు చింతామోహన్

ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీ, టీడీపీ, వైకాపాలు చింతామోహన్

తిరుపతి
బీజేపీ, టీడీపీ, వైకాపాలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది చింతా మోహన్ ఆరోపించారు.  నిరక్షరాస్యతను తగ్గించింది కాంగ్రెస్ అని అన్నారు. కరోనా, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యులు భోజనం చేయలేని పరిస్థితి వుంది. బీజేపీ, టీడీపీ, వైకాపాలు ప్రజల విశ్వాసం కోల్పోయారు. జగన్ వేల కోట్ల రూపాయల దోచుకున్నాడు. వివేకానంద రెడ్డి మా అన్న కుమారుడు ఇబ్బంది పడుతున్నారని వాపోయాడు. జగన్ రాజకీయల్లో ఉండడానికి అర్హుడు కాదు. రాజకీయం అంటే త్యాగాలు చేసి, సేవ చేయాలి. ఇప్పుడు పార్టీలు దోచుకోవడానికి వస్తున్నాయి.. ప్రశ్నించేవారు లేరని అన్నారు.  చెప్పులు లేని చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాదించారు. పేదల ఇళ్లు ఆపిన ఘనత చంద్రబాబుదే. పెయిడ్ న్యూస్ రాయింకుంటున్నారు. నెల్లూరులో ఒక మంత్రి 5 కోట్లు వసూలు చేశారు.. గూడూరు ఎన్నికల్లో పంపిణీకి. చంద్రబాబు 500 రూపాయలు పంచితే నీ పార్టీని రద్దు చేయమని ఎన్నికల సంఘాన్ని కోరుతాం. జగన్ 30 కోట్లు, చంద్రబాబు 20 కోట్లు ఖర్చు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయంకు ఎందుకు విమానాలు రాలేదు. తెదేపా, వైకాపాలు గూడూరులో డబ్బులు ఎందుకు పంచుతున్నాయి. ప్రజాస్వామ్యానికి పునాదులు పోయే పరిస్థితి నెలకొంది. మోడీ, అమిత్ షా లు తప్పులపై తప్పులు చేశారని అన్నారు. ఎన్నికల తర్వాత పూర్తి ఆధారాలు బయటపెడతాననిఅన్నారు. .

Related Posts