YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గుత్తా హాట్ కామెంట్స్

గుత్తా హాట్ కామెంట్స్

నల్గొండ, ఏప్రిల్ 15, 
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు చేశారు.వంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలవకుండా ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారంటూ మండలి ఛైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయడం జానారెడ్డికి ఇష్టం లేదని గుత్తా వ్యాఖ్యానించారు. కేవలం పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకే ఆయన పోటీ చేస్తున్నారని చెప్పారు.కాంగ్రెస్ ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా సాగర్ ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. సాగర్‌ అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎంతో కృషి చేశారని, ఆయన కుమారుడు నోముల భగత్‌ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు.టీడీపీని ముంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఓ భజన బ్యాచ్‌ను వెంటేసుకుని నాటకాలు ఆడుతున్నారని గుత్తా విమర్శించారు. కాంగ్రెస్ నాయకులెవరూ తెలంగాణ కోసం కొట్లాడలేదని అన్నారు. అధికారం రాలేదన్న బాధ తప్ప తెలంగాణ అభివృద్ధిపై ఆ పార్టీకి సోయి లేదని మండిపడ్డారు. ప్రస్తుతం తాను శాసన మండలి ఛైర్మన్ హోదాలో ఉన్నానని, అయినా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే తాను కూడా స్పందించాల్సి వచ్చిందని అన్నారు.జానారెడ్డికి సీఎం అయ్యే అవ‌కాశం ఎప్పుడూ రాలేదని, రాబోదని గుత్తా అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందన్న బాధ ఆ పార్టీని వెంటాడుతోందని, అంతే తప్ప తెలంగాణ అభివృద్ధిపై వారికి పట్టింపు లేదని విమర్శించారు. ఆనాడు కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నా...కాంగ్రెస్ నాయకులు దురాశతో విభేదించారని ఆరోపించార

Related Posts