YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కు జానా కౌంటర్

కేసీఆర్ కు జానా కౌంటర్

నల్గొండ, ఏప్రిల్ 15, 
కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సాగర్ అభ్యర్థి జానా రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు.తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా ఆ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా చూస్తోంది. ప్రచారం విషయంలో బీజేపీ కన్నా కాంగ్రెస్ అభ్యర్థి నుంచే పోటీ ఎక్కువ అవుతుండడంతో జానా రెడ్డి లక్ష్యంగా ముఖ్యమంత్రికేసీఆర్ కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హాలియాలో బుధవారం జరిగిన బహిరంగ సభలోనూ సీఎం కేసీఆర్ జానా రెడ్డి లక్ష్యంగానే విమర్శలు, ఆరోపణలు చేశారు. బీజేపీ అభ్యర్థి గురించి కనీసం మాట కూడా మాట్లాడలేదు.ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సాగర్ అభ్యర్థి జానా రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. హాలియా సభలో ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు. గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన.. కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దాచావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానంటున్నారు.. కానీ తమ పార్టీ రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో తల పెట్టి తెలంగాణ ఇచ్చిందన్న విషయం మరచిపోవద్దు. రాష్ట్ర సాధన కోసం మేం పూర్తిగా సహకరించాం కాబట్టే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. 30, 40 ఏళ్లు శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా నేను పనిచేశాను. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నారు. హైదరాబాద్‎లోనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు’’ అని కేసీఆర్‌పై జానారెడ్డి విమర్శలు చేశారు

Related Posts