కరీంనగర్, ఏప్రిల్ 15,
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు సొంత జిల్లాలోనే చుక్కెదురైంది. శుక్రవారం కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన ఆయన్ని నిరుద్యోగులతో కలిసి ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్ని అడ్డుకుని రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, లేకపోతే నిరుద్యోగులకు భృతి అయినా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో వారు మంత్రి కారుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ ఏబీవీపీ కార్యకర్త సృహతప్పి పడిపోయాడు. పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు