YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో షర్మిల పార్టీ..?

ఏపీలో షర్మిల పార్టీ..?

విజయవాడ, ఏప్రిల్ 17, 
వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)తో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోరు మొదలుపెట్టారు. తెలంగాణ రాజకీయాల్లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. తన అన్న వైఎస్ జగన్ రాజకీయ పార్టీ ప్రారంభించిన కొత్తలో అనుసరించిన విధానాన్నే ఫాలో అవుతున్నారు. ఏ మాత్రం గ్యాప్‌ లేకుండా రాజకీయ కార్యకలాపాలు చేపట్టి.. రాష్ట్రం మొత్తం తనవైపు చూసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.రాష్ట్రంలోని నిరుద్యోగులకు మద్దతుగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో 72 గంటల పాటు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తరలించడం, ఆమె జాకెట్ చిరిగిపోవడం సంచలనమైంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం వైఎస్ షర్మిల వైపు చూసింది. అయితే వైఎస్ షర్మిల రాజకీయంగా ఎవరికీ అంతుచిక్కని రాజకీయ వ్యూహాలు ఎక్కుపెడుతున్నారు. మొదట్లో షర్మిల పార్టీ వెనుక ఉండి నడిపిస్తోంది తన అన్న జగన్మోహన్ రెడ్డినే అన్న ప్రచారం సాగింది. షర్మిల పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడానికి ముందు ఇదే విషయాన్ని కీలక నేత కొండా రాఘవరెడ్డి కూడా చెప్పారు.ఈ సంఘటనతో తన అన్న సీఎం జగన్‌తో వైఎస్ షర్మిలకు విబేధాలు ఉన్న మాట వాస్తవమేనా? అన్న చర్చ మొదలైంది. అన్నపై కోపంతోనే తెలంగాణలో పార్టీ పెట్టారా అనే చర్చలు షురూ అయ్యారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాకు చెంది దళిత క్రైస్తవ నాయకులు ఇటీవల చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ‘మహాసేన’ అనే సంస్థ నాయకుడు రాజేష్ సరిపెళ్ల తన బృందంతో కలిసి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ షర్మిల పార్టీ ఏర్పాటుపై చర్చించినట్లు రాజేష్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు బ్రదర్ అనిల్ దీనికి కాస్త సమయం కావాలని చెప్పారని వెల్లడించారు. అంటే, ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పార్టీ ఏర్పాటుకు కాస్త టైం ఉందని బ్రదర్ అనిల్ చెప్పారే గాని, ఈ విషయాన్ని తిరస్కరించలేదని పలువురు కోట్ చేస్తున్నారు.తన అన్న జగన్మోహన్ రెడ్డితో నిజంగానే విభేదాలు ఉంటే, ఒకవేళ వాటికి చెక్ పెట్టకపోతే.. భవిష్యత్తులో కచ్చితంగా ఏపీలో కూడా షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక, ఏపీలో క్రైస్తవుల సమస్యలపై దూకుడుగా వెళ్లే ‘మహాసేన’ వంటి సంస్థ నేతలతో స్వయంగా మత ప్రచారకుడైన బ్రదర్ అనిల్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి, ‘మహాసేన’ రాజేష్.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతు ఇచ్చినా.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. పలు కేసుల్లో జైలుకు వెళ్లారు. సీఎం జగన్‌ను ఇంతగా వ్యతిరేకిస్తున్న రాజేష్‌.. బ్రదర్ అనిల్‌తో భేటీ కావడం కూడా సంచలనంగా మారింది. రాజకీయం విషయం పక్కనబెడితే అనిల్ అన్న దేవుడి పేరుతో వ్యాపారం చేసే వ్యక్తికాదు. చాలామందికి సహాయం చేసే వ్యక్తి అందుకే ఆయనంటే మాకు అభిమానం. ఇక విషయానికొద్దాం.తెలంగాణాలోనే కాకుండా ఆంధ్రాలో కూడా బీజేపీ కి ఎదురునిలిచే దమ్మున్న పార్టీ లేదు. మహాసేనని పార్టీగా మారుస్తాం.. మాకు తగినన్ని సీట్లు కేటాయిస్తే షర్మిళ గారి పార్టీని ఆంధ్రా తెలంగాణాల్లో కూడా ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు మా శక్తివంచన లేకుండా కృషిచేస్తాం’’ అని అనిల్ అన్న దృష్టిలో పెట్టాము. దానికి ఆయన కాస్త సమయం కావాలని చెప్పారు. నిజానికి ఆంధ్రాలో షర్మిళగారికి విపరీతమైన ఫాలోయింగ్ వుంది. అలాంటి వ్యక్తి ఆంధ్రాలో ప్రస్థానం మొదలుపెడితే రాజకీయ సమీకరణాలు తారుమారవుతాయి.షర్మిళ లో రాజశేఖర్ రెడ్డి  కొట్టొచ్చినట్టు కనిపిస్తారు. పాదయాత్ర సమయంలో షర్మళ గారి మాటలకి ప్రజలు ముగ్ధులైపోయారు. ఇప్పుడు కూడా ఆవిడ ఆంధ్రాలో తిరిగితే ప్రజలు నీరాజనాలు పడతారు. నేను ఎవరిమీదో కోపంతో ఇలా రాయలేదు. క్రికెట్‌లో ఇండియా బంగ్లాదేశ్ పై నెగ్గితే కిక్కుండదు.. పాకిస్థాన్ పై నెగ్గితేనే అసలైన కిక్కు. అలాగే షర్మిళ  పార్టీ తెలంగాణాలో తెరాస, బీజేపీ తో తలపడితే కిక్కుండదు. ఆంధ్రాలో టీడీపీ, జనసేన+ బీజేపీ వంటి ఉద్దండులతో కూడా పోటీపడి గెలిస్తేనే అసలైన కిక్కు.

Related Posts