నల్గోండ
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయ్యింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ముగిస్తుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 2,20,300 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పోలింగ్ సమయాన్ని రెండు గంటలపాటు పొడిగించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది బరిలో నిలిచారు.