YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓట్లరను ఇబ్బంది పెడుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి

ఓట్లరను ఇబ్బంది పెడుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి
టీడీపీ నేతలు దొంగ ఓటర్లను పురమాయించి.. వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెదేపా అనుకూల మీడియా పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఓటర్లను మీడియా ఇబ్బంది పెట్టడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రాజకీయ లబ్ధికోసం ఇష్టానుసారంగా మాట్లాడితే ఉపేక్షించమని హెచ్చరించారు.కిరణ్ కుమార్‌రెడ్డితో కలిసి  తెదేపా వాళ్లే ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని,తనను స్మగ్లర్‌గా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెదేపా తీరు చాలా అభ్యంతరకరమని చెప్పారు.తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాను ఎదుర్కోలేక ముందుగా ప్రణాళిక రచించి దారుణాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts