రంగారెడ్డి
రంగారెడ్డిజిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రం గూడా లో 106 కమ్యూనిటీ సిసి కెమెరాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , రాచకొండ సీపీ మహేష్ భగవత్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ 106 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఇచ్చిన కార్పొరేటర్ గడంలాక్ష్మారెడ్డి ని ప్రశంసించారు. సిసి కెమెరాలతో 24 గంటల్లో కేసులను ఛేదించగగలిగామని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు,అపార్ట్ మెంట్లలో సీసీ కెమెరాల విధిగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాచకొండ పరిధి లో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో 11 వేల కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఉన్నాయని. అవి నేరుగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ టెన్ లోని కమాండ్ కంట్రోల్ కి కనెక్ట్ అవుతాయి అని తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే వంద మంది పోలీసులు పని చేసినట్టు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు లక్షల 65 వేల కెమెరాలు ఏర్పాటు చేసామని మంత్రి అన్నారు.