YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓటు హక్కును వినియోగించుకున్న పనబాక దంపతులు

ఓటు హక్కును వినియోగించుకున్న పనబాక దంపతులు

నెల్లూరు
 తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త, జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు పనబాక కృష్ణయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు జిల్లా, కోట మండలం పరిధిలోని వెంకన్న పాలెం ఎస్సీ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో శనివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా అధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని జోస్యం చెప్పారు. పార్లమెంట్ లో వైకాపా ఎంపీలు ఎంతో మంది ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ లేదా జగన్మోహన్ రెడ్డి భజన చేయడం తప్ప, ప్రజాసంక్షేమం కోసం గళం ఇప్పడం లేదని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి విజయం తద్యం అన్నారు.

Related Posts