నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం మళ్ళీ తెరమీదకొచ్చింది. బెట్టింగ్ వ్యవహారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాత్ర ఉందంటూ, విచారణకు హాజరు అవ్వాలంటూ అప్పట్లో నెల్లూరు జిల్లా పోలీసులు శ్రీధర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యే విచారణ కు హాజరు కాలేదు. ఈ విషయాన్ని జిల్లా పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. తమ వద్దనున్న ఆధారాలను కోర్టుకి సమర్పించడంతో వచ్చే నెల 14న కోర్టుకి హాజరవలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరో అడుగు ముందుకేసిన ఎస్పీ రామకృష్ణ టీం బుకీలతో, పంటర్లతో ఎమ్మెల్యే కి ఉన్న సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలపై పక్క ఆధారాలు సేకరించి ఎసిబికి సమర్పించింది. దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్పీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.. పోలీసుల కుట్రలను ప్రజల మద్దతు తో తిప్పికొడతనన్నారు. ఎస్పీ బెదిరింపులకు తన కార్యకర్తలు కూడా బయపడరని స్పష్టం చేశారు..