YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ఇంత దారుణమా...

వైసీపీ ఇంత దారుణమా...

విజయవాడ, ఏప్రిల్ 18,
పోలీసులు, ఎన్నికల అధికారులు, గ్రామ, వార్డు వాలంటీర్లు మొత్తంగా కుమ్మక్కైపోయి తిరుపతి ఉప ఎన్నికను ఓ ప్రహసనంగా మర్చేశారని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఇంత అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న ఈ ఉప ఎన్నిక ఎందుకని ప్రశ్నించారు. స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. తిరుపతిలో స్థానికులు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఇక, పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి గానీ, వైసీపీ కోసం పనిచేస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సరిహద్దులు మూసేసి తనిఖీలు చేసి పంపించాల్సిందని.. కానీ, చెక్‌పోస్టులను పోలీసులు ఎందుకు ఎత్తేశారని నిలదీశారు. బీజేపీ నాయకులు శాంతా రెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారని.. ఆమె మాదిరిగానే, దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని అసహనం వ్యక్తం చేశారు.ఇతర ప్రాంతాల నుంచి వందలాది మందిని తీసుకొచ్చి పర్యాటకులు అంటున్నారని.. అన్ని అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారులు ఉన్నది జగన్‌ అనే వ్యక్తి కోసం కాదని.. ఇవాళ తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ అక్రమాలపై ఈసీకి అన్ని ఆధారాలు సమర్పిస్తామని.. ఈ దారుణాలను బయటపెట్టిన టీడీపీ శ్రేణులను అభినందిస్తున్నట్లు చెప్పారు.

Related Posts