రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం నాడు మంత్రి కాలవ శ్రీనివాసులు పర్యటించారు. హంద్రి-నీవా ప్రాజెక్టులో భాగంగా మాల్యం బ్రాంచి కెనాల్ పనులు అయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రూ.260 కోట్లతో మాల్యం బ్రాంచి కెనాల్ పనులు చేపడుతున్నాం, ఈ బ్రాంచి కాల్వ ద్వారా 13,462 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని అన్నారు. కణేకల్ మండలంలో 25వేల ఎకరాలకు సాగునీటిని అందింస్తాం, ఈ ప్రాంత రైతుల చిరకాల కోరిక తీరుస్తామన్నారు. రాయదుర్గంలో కరువును శాశ్వతంగా తరిమికొడతాం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సహకారంతో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని అయన అన్నారు.