నర్సిపట్నం
విశాఖ జిల్లా నర్సీపట్నంలో సాలిక మల్లవరం ప్రాంతంలో రంగురాళ్లు క్వారీ తవ్వకాలు జారిగాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సందర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ట్విట్టర్ బాబు అసత్య ప్రచారాలు మానుకోవాలని ,సాలిక మల్లవరం కరక రంగు రాళ్ళు క్వారీలో అలగ్జాండర్ స్టోన్స్ అని మాట్లాడం సరికాదని అన్నారు.సాలిక మల్లవరం రైతు పంట పొలంలో భూమిని సదును చేసుకోవడానికి మట్టి తిసుకొని వుంటే దాన్ని వేరే విధంగా మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవ సాయ భూమిలో రైతు తోట కోసం భూమిని చదును చేసుకుంటే దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.