ఏపీపై పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అత్యున్నత సాంకేతికతను వివిధ రంగాల్లో వినియోగిస్తున్నదని, వెబ్ సైట్లను హ్యాక్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కొందరు ఉన్నారని లోకేష్ అన్నారు.విశాఖపట్నం లో సైబర్ సెక్యూరిటీ సమ్మిట్...
మాస్టర్ కార్డ్ సీనియర్
వైస్ ప్రెసిడెంట్ రవి
అరోరా,ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశం
సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ కార్డ్ మధ్య ఒప్పందం
కుదుర్చుకుంది. ఫార్మర్ మార్కెట్ ప్లేస్ సొల్యూషన్స్,సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ ట్రాన్సిట్ అండ్ స్మార్ట్ సిటీస్,శిక్షణ,నైపుణ్య అభివృద్ధి అంశాల్లో మాస్టర్ కార్డ్ తో ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం దగ్గర భూమి వివరాలు,వేసిన పంట వివరాలు ఇలా ఎంతో సమాచారం ఉందని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు.
దీనిని వినియోగించుకొని రైతులకు క్రెడిట్ రేటింగ్ ఇవ్వగలిగేతే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని...
బ్యాంకులు త్వరితగతిన రైతులకు అప్పు ఇచ్చే పరిస్థితి వస్తుందిన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీ వినియోగిస్తోందని....ఐఓటి పరికరాలను వినియోగిస్తున్నాం
దీని వలన సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం కూడా ఉంది
అందుకే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేసామన్నారు.తిరుపతిలోని ఐఐడిటి ద్వారా బ్లాక్ చైన్,సైబర్ సెక్యూరిటీ లాంటి అధునాతన టెక్నాలజీల పై శిక్షణ ఇస్తున్నామని...
మంత్రి నారా లోకేష్
ఒప్పందం లో భాగంగా చిన్న రైతులు పండించే పంటలు, డ్వాక్రా మహిళలు తయారు చేసే వివిధ ఉత్పత్తులు,
కొనుగోలుదారులను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి ఫైనాన్సియల్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది.
సైబర్ సెక్యూరిటీ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం
స్మార్ట్ సిటీస్ లో భాగంగా లెస్ క్యాష్ సిటీస్ గా మార్చడం
ఐఐడిటి తో భాగస్వామ్యం తో సైబర్ సెక్యూరిటీ లో శిక్షణ ఇవ్వడానికి అంగీకరించింది..మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ రవి అరోరా వీటిని నివారించేందుకు సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటరును ఏర్పాటు చేశామని లోకేష్ గుర్తు చేశారు. బ్యాంకుల నుంచి రుణాలను పొందే విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారికి క్రెడిట్ రేటింగ్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు....