YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో లాక్ డౌన్... వైన్ షాపుల ముందు క్యూ

ఢిల్లీలో లాక్ డౌన్... వైన్ షాపుల ముందు క్యూ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19, 
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రిఅరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి నుంచే లాక్‌డౌన్ అమల్లోకి రానుండటంతో మద్యం ప్రియులు వైన్ షాపులకు పోటెత్తారు. ఏప్రిల్ 26 ఉదయం వరకు ఆరు రోజులు పాటు లాక్‌డౌన్ కొనసాగనుండగా.. మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు రోజులు మద్యం లేకుండా ఉండటం కష్టమనుకున్నారో ఏమో మందుబాబులు దుకాణాల ముందు బారులుతీరారు.దీంతో కోవిడ్ నిబంధనలు గాలికొదిలేశారు. భౌతికదూరం ఎక్కడా పాటించడంలేదు. శివపురి గీతా కాలనీలో మద్యం కొనుగోలుకు వచ్చిన ఓ మహిళ మాట్లాడుతూ..‘‘ఇంజెక్షన్ వల్ల ప్రయోజనం ఉండదు.. ఆల్కహాల్‌ ఆ ప్రయోజనం చేకూరుస్తుంది ... నేను మందుల ద్వారా ప్రభావితం కాను, పెగ్ ద్వారా సంతోషంగా ఉంటాను’’ అని వ్యాఖ్యానించింది.లాక్‌డౌన్ సమయంలో ఔషధాలు, నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంచాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ తప్పనిసరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత కష్టకాలంలో ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు సమిష్టిగా ఉండాలని అన్నారు. ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నామని, భయపెట్టడం మా ఉద్దేశం కాదని కేజ్రీ పేర్కొన్నారు.అన్ని ప్రయివేట్ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే పనిచేస్తాయని తెలియజేశారు. ప అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వలస కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని సీఎం అభ్యర్ధించారు

Related Posts