YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రోజు పెగ్గు వేస్తే... నో కరోనా

రోజు పెగ్గు వేస్తే... నో కరోనా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19, 
దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నా మందుబాబుల్లో ఏమాత్రం భయం కనిపించడం లేదు. కరోనా లేదు.. గిరోనా లేదంటూ వైన్‌షాపుల ముందు బారులు దీరుతున్నారు. పెగ్గేస్తే కరోనా అయినా పారిపోవాల్సిందేనని ధీమాగా ఉండడం చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇంగ్లిష్ మందులు పనిచేయవని.. తామేసే మందు మాత్రమే పనిచేస్తుందని చెప్పడం చూస్తే కంగుతినాల్సిందే. అందులోనూ ఓ మహిళ.ఢిల్లీ ప్రభుత్వం ఈ రోజు రాత్రి నుంచి ఆరు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. 19వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 26 వ తేదీ ఉదయం 6 గంటల వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. లాక్‌డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాల వద్ద రద్దీ భారీగా పెరిగిపోయింది. వారం రోజుల పాటు వైన్ షాపులు ఉండవని తెలిసి మద్యంప్రియులు షాపుల ముందు క్యూ కట్టారు.ఢిల్లీలోని శివపురి గీతాకాలనీలోని మద్యం దుకాణం వద్ద బారులుదీరిన మద్యంప్రియులను మీడియా పలకరించింది. వైన్ షాపుకి వచ్చిన మహిళను ప్రశ్నించగా దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చింది. కరోనా వైరస్ నియంత్రణకి ఇంజెక్షన్లతో ఉపయోగం లేదని.. మందు వేస్తే సరిపోతుందని చెప్పడంతో కంగుతిన్నారు. తాను 35 ఏళ్ల నుంచి మద్యం తాగుతున్నానని.. ఇంగ్లిష్ మందులతో ఏం కాదని.. రోజూ పెగ్గేస్తే అన్నీ మాయం అంటూ ఆమె చెప్పిన సమాధానంతో అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Posts