న్యూఢిల్లీ ఏప్రిల్ 20
కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇండ్లకు తిరుగుముఖం పడుతున్న వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వలస కార్మికుల ఖాతాలను సేకరించి నగదు వేయాలని ఆయన సూచించారు. కొవిడ్-19 వ్యాప్తి పెరుగుతుండటంతో అమలు చేస్తున్న ఆంక్షలు, కఠినమైన చర్యలను అనుసరించి వలస కార్మికులు ఇండ్లకు తిరుగుముఖం పట్టడం ప్రారంభించారు.‘వలస కూలీలు మరోసారి ఇండ్లకు వెళ్లిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు వేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అయితే కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం ప్రజలను నిందిస్తూ ప్రజా ప్రయోజనాల కోసం ఈ చర్య తీసుకుంటుందా?’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.