కోల్కతా ఏప్రిల్ 21
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని బాలూర్ఘాట్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆమె.. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడానికి ప్రధాని నరేంద్రమోదీయే కారణమని ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ను మోదీ సృష్టించిన విపత్తుగా అభివర్ణించారు.దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉన్నది. నేను దీన్ని మోదీ సృష్టించిన విపత్తే అంటాను. ఆస్పత్రుల్లో సరిపడా ఇంజెక్షన్లు లేవు. ఆక్సిజన్కూ కొరతే ఉన్నది. దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కరోనా టీకాలను, ఔషధాలను మాత్రం విదేశాలకు తరలించారు అని మమతా బెనర్జి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మళ్లీ బెంగాల్ ఇంజిన్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని, మోదీ డబుల్ ఇంజిన్ గవర్నమెంటుకు అవకాశమే ఉండదని ఆమె పేర్కొన్నారు.