వచ్చే నెల 8, 9 తేదీల్లో రెండ్రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కాన్ఫరెన్స్ వచ్చే నెల 8, 9వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఉండవల్లిలోని సీఎం నారా చంద్రబాబునాయుడు నివాసం సమీపంలో ఉన్న గ్రీవెన్స్ హాల్ లో జరగనున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు ఆ ప్రకటనలో తెలిపారు.