అమరావతి
సెకండ్ వేవ్లో ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకూ ఇటు వైరస్బారిన పడుతున్నవారితో పాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉససంఘం భేటీ అయ్యింది. మంత్రి ఆళ్ల నాని సారథ్యంలో రాష్ట్రంలో కొవిడ్ నివారణ, పర్యవేక్షణ, వ్యాక్సినేషన్పై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ లభ్యత, వైద్య నిపుణుల నియామకం తదితర అంశాలపైన, మరియు 10 వ తరగతి ,ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశం పైనా.. రాష్ట్రంలో ఆంక్షల విధింపు అంశంపైనా చర్చించినట్లు సమాచారం.