న్యూఢిల్లీ ఏప్రిల్ 22
సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో కరోనా వైరస్ విషాదాన్ని మిగిల్చింది. కరోనా బారినపడిన ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు. ఆశిష్కు రెండు వారాల క్రితం కరోనా సోకింది. దీంతో ఆయన గుర్గావ్లోని మేదాంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన మరణించినట్లు సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా తెలిపారు.‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో చనిపోయాడని చెప్పడానికి బాధపడుతున్నాను. మాకు నమ్మకాన్ని కల్పించిన వారందరికి ధన్యవాదాలు. చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, మాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.