YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా‌ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై కేటిఅర్ అసంతృప్తి... రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎంకేర్‌ భరించాలి

కరోనా‌ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై కేటిఅర్ అసంతృప్తి...  రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎంకేర్‌ భరించాలి

హైదరాబాద్‌ ఏప్రిల్ 22
దేశంలో కరోనా‌ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి రూ.150కి, రాష్ట్రాలకు రూ.400 టీకా సరఫరా చేస్తామని ఓ వ్యాక్సిన్‌ కంపెనీ ప్రకటించడంపై ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఒకే దేశం – ఒకే పన్ను కోసం జీఎస్‌టీని అంగీకరించామని, కానీ, ఇప్పుడు ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు చూస్తున్నామని విమర్శించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్‌ నుంచి భరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.
 

Related Posts