హైదరాబాద్ ఏప్రిల్ 22
దేశంలో కరోనా వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి రూ.150కి, రాష్ట్రాలకు రూ.400 టీకా సరఫరా చేస్తామని ఓ వ్యాక్సిన్ కంపెనీ ప్రకటించడంపై ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒకే దేశం – ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించామని, కానీ, ఇప్పుడు ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్కు రెండు ధరలు చూస్తున్నామని విమర్శించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్ నుంచి భరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.