న్యూఢిల్లీ ఏప్రిల్ 22
దేశంలో కేవలం కరోనా వల్లనే సంక్షోభం రాలేదు అని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సంక్షోభం వచ్చినట్లు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో స్పందించారు. కరోనా సోకిన తాను ఇంట్లోనే క్వారెంటైన్లో ఉన్నట్లు చెప్పారు. కానీ దేశం నలుమూల నుంచి వస్తున్న కరోనా సమాచారం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. దేశ ప్రజలకు అబద్దాల ప్రసంగం అవసరం లేదని, దేశానికి ఒక పరిష్కారం కావాలని ప్రధాని మోదీని విమర్శిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. కోవిడ్19 సెకండ్ వేవ్ నియంత్రణలో మోదీ సర్కార్ విఫలమైనట్లు ఆయన ఆరోపించారు.