YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

పాక్ లో చైనీస్‌ అంబాసిడర్‌ ఉన్న హోటల్‌ వద్ద కారు బాంబు పేలుళ్లు... నలుగురు మృతి, డజన్లకొద్ది మందికి గాయాలు

పాక్ లో చైనీస్‌ అంబాసిడర్‌ ఉన్న హోటల్‌ వద్ద కారు బాంబు పేలుళ్లు...  నలుగురు మృతి, డజన్లకొద్ది మందికి గాయాలు

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 22
చైనా రాయబారి తన బృందంతో పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో రాజధాని క్వెట్టాలోని ఓ పేరుమోసిన హోటల్‌లో ఆతిథ్యం కల్పించారు. అయితే వారు బసచేస్తున్న హోటల్‌ బయట బుదవారం  రాత్రి ఓ కారు బాంబు పేలింది. దీంతో నలుగురు మృతిచెందగా, డజన్లకొద్ది గాయపడ్డారు. చైనీస్‌ అంబాసిడర్‌ ఉన్న సెరెనా హోటల్‌ వద్ద పార్క్‌ చేసిన ఓ కారులో పేలుళ్లు సంభవించాయి. అయితే ఆ సమయంలో చైనా రాయబారి ఆ హోటల్‌లో లేరని పాకిస్థాన్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ షేక్‌ రషీద్‌ చెప్పారు. ఈ పేలుళ్లలో నలుగురు చనిపోగా, 12 మంది గాయపడ్డారని తెలిపారు.కాగా, ఈ పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ గ్రూపూ బాధ్యతవహిస్తున్నట్లు ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. ఓ కారులో ఉంచిన ఐఈడీని పేల్చినట్లు నిర్ధారించారు. గతంలో కూడా బలూచిస్తాన్‌లో ఇలాంటి పేలుళ్లు సంభవించాయి. గతేడాది జూన్‌లో చైనీస్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టిన పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ లక్ష్యంగా బాంబుదాడి జరిగింది. బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్టీ ఈ దాడికి పాల్పడింది. ఇప్పుడుకూడా అదే సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Related Posts