YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మా దగ్గర ఉత్పత్తి అవుతున్న రెమ్డిసివర్ పై మాకే హక్కు వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం పై మంత్రి ఈటెల ఆగ్రహం

మా దగ్గర ఉత్పత్తి అవుతున్న రెమ్డిసివర్ పై మాకే హక్కు   వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం పై మంత్రి ఈటెల ఆగ్రహం

హైదరాబాద్ ఏప్రిల్ 22
మా దగ్గర ఉత్పత్తి అవుతున్న రెమ్డిసివర్ పై మాకే హక్కు ఉందని.. ఈవిషయంలో వెనక్కి తగ్గేది లేదని.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేసారు. దేనితో ఈటెల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ``మా దగ్గర ఉత్పత్తి అవుతున్న రెమ్డిసివర్పై మీ పెత్తనం ఏంటి?`` అంటూ  కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. తమిళనాడు తరహాలో మా ఆక్సిజన్ మేమే వాడుకుంటాం మన్నారు.  తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఈటల రాజేందర్ ఆరోపిం చారు.  కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో తాము విసిగిపోతున్నామని.. ఇదే పద్ధతి పరిస్థితి కొనసాగితే.. మున్ముందు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని కూడా ఈటల హెచ్చరించారు.గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాం డ్ చేశారు.  కరోనా వైరస్తో ప్రపంచం అంతా అల్ల కల్లోలంగా మారిందన్నారు. తెలంగాణ ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ వారు డబ్బులు చెల్లించలేని వారిని గాంధీకి పంపుతున్నారని అన్నారు.  బ్లాక్ లో ఆక్సిజన్ సరఫరా చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ఆక్సిజన్ పై ఐ ఏ ఎస్ ల బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. కానీ అందరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అలా లేదని మంత్రి స్పష్టం చేశారు. గాంధీలో కరోనా పేషెంట్లకు అవసరమైన అందుతోందని తెలిపారు. మొత్తానికి ఈటెల వ్యాఖ్యలు గరంగరంగా మారాయని అంటున్నారు పరిశీలకులు.

Related Posts