విజయనగరం
విజయనగరం జిల్లా సాలూరు మండలం సాలూరు పట్టణము లో సాలూరు నియెాజక వర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ రేగి మహేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో రేగి మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటు గిరిజనాబివ్రద్ది మరచి తన స్థాయిని పదలపర్చకోవడానికి వాస్తవాలు వక్రీకరించడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. హైకోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో అమాయక గిరిజనులు ను మభ్యపెట్టె విదంగా పత్రిక ప్రకటన ఇవ్వడం సరిగా లేదని అన్నారు. కులం అనేది ప్రతి వ్యక్తి తాత తండ్రుల నుండి వస్తుందని మీ సర్టిఫికేట్ ల నిజాఎుతీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీవాణి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.