ఎమ్మిగనూరు
పట్టణంలో వైస్సార్ సున్నా వడ్డీ పథకం డ్వాక్రా మహిళలకు వరం అని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలోని ఎమ్మెల్యే స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్కాచెల్లమ్మలకు జగన్ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కష్టకాలంలోను మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. గత ప్రభుత్వంలో స్వయం సహాయక సంఘల్లోని మహిళకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్నకు అందరూ అండగా నిలవాలన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో పొదుపు సంఘాలు 1835, పొదుపు సంఘాల సభ్యులు 18350 మంది, రెండో ఏడాది రూ. 2.16 కోట్లు చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు , వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఎం. క్రిష్ణా , డిఈఈ వేంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ మోహన్, టీఎమ్ సీ సుదాకర్, సిఇఓ ఆరుణ, పుల్లయ్య, నారాయణమ్మ, ఆరుణమ్మ, జిల్లా పొదుపు సమఖ్య అద్యక్షులు హేమలత రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్, పొదుపు మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.