అమరావతి ఏప్రిల్ 23
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ఏపీలో కూడా ఆరోగ్య సంక్షోభం నెలకొన్నది. సాధారణ జనంతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారినపడ్డారని తెలిసిన వెంటనే అతని అభిమానులు తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, హోమ్ క్వారంటైన్లో ఉండాలని మంత్రి కోరుతున్నారు