YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా

అమ‌రావ‌తి ఏప్రిల్ 23
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న‌ది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ఏపీలో కూడా ఆరోగ్య సంక్షోభం నెలకొన్న‌ది. సాధార‌ణ జ‌నంతోపాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్నారు. తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స‌ తీసుకుంటున్నారు.కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారినపడ్డారని తెలిసిన వెంట‌నే అత‌ని అభిమానులు త‌మ నాయ‌కుడు త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, హోమ్ క్వారంటైన్‌లో ఉండాల‌ని మంత్రి కోరుతున్నారు

Related Posts