YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ‌ శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యుల‌కు క‌రోనా

తెలంగాణ‌ శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యుల‌కు క‌రోనా

హైద‌రాబాద్ ఏప్రిల్ 23
తెలంగాణ‌ శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న నిమ్స్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంతా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఒక వేళ పాజిటివ్ నిర్ధార‌ణ అయితే హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని సూచించారు.రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్‌ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

Related Posts