YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కొవిడ్ పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

కొవిడ్ పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23, 
దేశంలో నెలకున్న కొవిడ్‌ పరిస్థితులపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతోంది. అయితే, అమికస్ క్యూరీగా నియమితులైన సీనియర్ న్యాయవాది హరీశ్‌ సాల్వే విచారణ నుంచి శుక్రవారం తప్పుకున్నారు. దేశం ప్రస్తుతం అత్యంత గందరగోళ స్థితిలో ఉందన్న సాల్వే.. న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత క్లిష్టమైన విచారణ ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఏ బాబ్డేతో తనకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నందున ఈ విచారణ నుంచి తాను తప్పుకొంటున్నట్లు సాల్వే వెల్లడించారు.కోవిడ్ నియంత్రణ అంశంపై గురువారం విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వేను అమికస్ క్యూరీగా నియమించడంపై ప్రతిపక్షాలు అభ్యంతర వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణ ప్రారంభమైన వెంటనే అమికస్‌ క్యూరీగా తప్పుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ సాల్వే ధర్మాసనాన్ని కోరారు.ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తాము ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమే అని తెలిపింది. మరోవైపు, సుప్రీంకోర్టు నిర్ణయంపై కొందరు సీనియర్‌ లాయర్లు చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టుల్లో విచారణను ఆపాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అయినా కొందరు లాయర్లు తప్పుగా ఆపాదిస్తూ వాదనలు నిలిపివేయడం సరికాదని కోర్టు పేర్కొంది. అంతేకాదు, సాల్వేపై చేసిన విమర్శలు బాధకరమని వ్యాఖ్యానించింది.అమికస్‌ క్యూరీగా సాల్వే స్థానంలో మరో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను నియమిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు కొవిడ్‌ కట్టడి విషయంలో కేంద్రం తన స్పందన తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ ఎన్ రావు, జస్టిస్ రవీంద్ర భట్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 27కు వాయిదా వేసింది.దేశంలో చాలా మంది ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నారని ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఆక్సిజన్‌, ఔషధాలను సక్రమంగా సరఫరా చేయడానికి, కరోనా రోగులకు చికిత్స అందించడానికి ఒక జాతీయ ప్రణాళిక రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే, లాక్‌డౌన్‌ విధింపుపై హైకోర్టులకున్న న్యాయపరమైన అధికారాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.కొవిడ్‌ సంబంధిత అంశాలపై ఢిల్లీ, బాంబే, మధ్యప్రదేశ్, కలకత్తా, అలహాబాద్, సిక్కమ్ హైకోర్టుల్లో జరుగుతున్న విచారణ వల్ల గందరగోళం ఏర్పడే పరిస్థితులున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది

Related Posts