YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వివాదంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

వివాదంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

వరంగల్, ఏప్రిల్ 24, 
వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల వేళ స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో ఇరుక్కున్నారు. ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ రిలీజ్ అయిన పాంప్లెట్ ఇప్పుడు వరంగల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్‌చల్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రం విడుదల చేయడం కలకలం సృష్టిస్తోంది.మొదటి నుండి పార్టీలో పనిచేస్తున్న వారికి కాకుండా రౌడీషీటర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు టికెట్లు ఇస్తున్నారంటూ అలా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పాంప్లెట్‌లలో గుర్తు తెలియని వ్యక్తులు పేర్కొన్నారు. డివిజన్లలో సర్వేలు చేసి వారికి టికెట్లను కేటాయిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.అయితే, అవి నామమాత్రమేనని ఎమ్మెల్యేలే చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే అభిప్రాయాన్ని కరపత్రంలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు, పార్టీ కోసం పనిచేసే వారికి, విద్యావంతులకు టికెట్లు దక్కేలా చూడాలని, దీనిపై ఆయన ట్విట్టర్‌లో స్పందించాలని ఆశావహులు కోరుతున్నారు.

Related Posts