YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

ఎస్సైను హతమార్చిన మావోయిస్టులు

ఎస్సైను హతమార్చిన మావోయిస్టులు

బీజూపూర్
చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్  జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు.  గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ వద్ద మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన తాతి మురళి  అనే పోలీసు ఎస్సైని ని పుల్సుమ్ పారా వద్ద మావోయిస్టు హత్య చేసారు. తరువాత మృతదేహాన్ని రోడ్డుపై పడవేసారు. మృతదేహంపై  బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో  లేఖ వదిలిపెట్టి వెళ్లారు. మృతుడు ఎస్సై  మురళి 2006 సమయం లో సల్వా జుడుం నుండి 2021 డీఆర్జీ  పోలీసు శాఖలో పనిచేస్తూ ఛత్తీస్ ఘడ్ లోని పలు ఆదివాసీ గ్రామాలలో అమాయక ఆదివాసీ గిరిజనులను పలు  హత్య చేసిన ఘటనలతో పాటు మహిళలను అత్యాచారం చేసాడనిమావోయిస్టులు ఆరోపించారు. అతనికి పలుమార్లు హెచ్చరికలు కూడా చేశామని అన్నారు. అయినా అతని ప్రవర్తన మార్చుకోకపోవడంతో ప్రజాకోర్టు నిర్వహించి చంపామని మావోయిస్టులు మృతదేహం వద్ద లేఖ వదలి పెట్టి వెళ్లారు. మూడు రోజులుగా మురళి ఆచూకీ కోసం గోండ్వానా సమితి వారు,మురళి బంధువులు మావోయిస్టులకు మురళిని విడిచిపెట్టమని కోరిన సంగతి తెలిసిందే.

Related Posts